హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మంది అధికారులకు ఈ నెల 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్కు లేఖ రాసింది. నాన్ సివిల్ సర్వీసెస్ కోటా కింద 25 మంది అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీలోని యూపీఎస్సీ భవన్లో ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
కన్ఫర్డ్ ఐఏఎస్లు వీరే..
వీ శ్రీనివాసులు, ఎస్ సురేశ్, కే హరిత, డీ శ్రీనివాస్నాయక్, ఎన్ యాదగిరిరావు, కే చంద్రశేఖర్రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి, కే అశోక్రెడ్డి, వీ సైదా, పీ మహేందర్, డీ ప్రశాంత్కుమార్, టీ వెంకన్న, ఈ నవీన్ నికోలస్, వీ సర్వేశ్వర్రెడ్డి, వీ శ్రీనివాసరెడ్డి, పీ కాత్యాయని దేవీ, పీ వెంకటేశం, ఆర్ లక్ష్మణుడు, ఏ పుల్లయ్య, ఆర్ ఏడుకొండలు, డీ హన్మంతు, సీ చంద్రకాంత్రెడ్డి, వీ పాపయ్య, జీవీ నారాయణరావు, ఎం పద్మజ.