నల్లగొండ : మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిల సమక్షంలోనే కార్యకర్తలు గొడవకు దిగడం గమనార్హం.
వేదిక మీద ఫ్లెక్సీలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ అర్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు గొడవ మొదలు పెట్టారు. తమ నేత ఫొటో ఎందుకు పెట్టలేదని అగ్రహిస్తూ వేదిక మీదకు దూసుకువచ్చారు.దీంతో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గీయులు ప్రతిగా ఆందోళనకు దిగారు.
ఇరువర్గాలు నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఇదే సమయంలో కొంత మంది సీనియర్ నేతలు కూడా తమను వేదికపైకి పిలవలేదని ఉత్తమ్, జానాలను నిలదీశారు. చివరకు జానారెడ్డి ఇరువర్గాల కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం సద్దుమణిగింది.