దుండిగల్, నవంబర్ 21: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వై యాక్సిస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వై యాక్సిస్ సొల్యూషన్స్ సంస్థ సౌజన్యంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ దినపత్రికల ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగావకాశాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఆం గ్ల భాషపై పట్టుసాధిస్తే విదేశీ చదువుల వేటలో సగం విజయం సాధించినట్టేనని చెప్పారు. బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో 90 శాతానికి పైగా మాస్టర్ డిగ్రీని విదేశాల్లో చదివేందుకు ఉత్సుకత చూపుతున్నారని తెలిపారు. సరైన మార్గదర్శనం లేని కారణంగానే చాలామంది విద్యార్థులు విదేశీ విద్యను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. యూఎస్, కెనెడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు కనీసం 7 నుంచి 14 నెలల సమయం పడుతుందని వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు వై యాక్సిస్ను సంప్రదిస్తే సరైన సలహాలు, సూచనలు అందించి మార్గనిర్దేశనం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మర్రి శ్రేయారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్రావు, ఐక్యూఏసీ హెడ్ డాక్టర్ రాధికాదేవి, పౌర సంబంధాల అధికారి డాక్టర్ రఘునాథ్రావు, తెలంగాణ పబ్లికేషన్స్ ఈవెంట్ మేనేజర్ టీ గణేశ్ పాల్గొన్నారు.
ఎంతో విలువైన సమాచారం
విదేశీ విద్యపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యం లో నిర్వహించిన సదస్సు వి ద్యార్థులోని అపోహలను తొలగించడానికి దోహదపడింది. విదేశాల్లో ఉన్న త విద్యాభాస్యం చేయాలనుకొనే విద్యార్థులకు ఎంతో విలువైన సమాచారం అందించారు. విదేశాల్లో ఎంతోమం ది ఎంఎల్ఆర్ఐటీ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
– డాక్టర్ కే శ్రీనివాస్రావు,ప్రిన్సిపాల్, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల
విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరం
ఈ సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సరైన కార్యాచరణతో విద్యార్థులు శ్రమి స్తే విదేశీ విద్య పెద్ద కష్టమేమీ కాదు. సదస్సు ద్వారా విలువైన సూచనలు, సలహాలు అందించేందుకు కృషి చేసిన పత్రికల యాజమాన్యానికి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు.
– మర్రి రాజశేఖర్రెడ్డి,ఎంఎల్ఆర్ఐటీ కళాశాల సెక్రటరీ
సదస్సు ఏర్పాటు అభినందనీయం
సామాజిక దృక్పథం తో వై యాక్సిస్ కన్సల్టెన్సీ, ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ యాజమాన్యాలు ఇటువంటి సదస్సులు నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి సదస్సుల వల్ల విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలుగుతుంది.
-మర్రి లక్ష్మణ్రెడ్డి, ఎంఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్