హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : అన్ని కాలేజీల విద్యార్థులకు అధ్యాపకులు నీటి నిర్వహణ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సైంటిస్టు డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ అన్నారు. శనివారం జేఎన్టీయూలో ఎన్విరాన్మెంట్ వరల్డ్ వాటర్ డే సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు వారి వారి పరిసర ప్రాంతాల్లో చదువు రాని వారికి నీటి విలువల గురించి చెప్పాలని సూచించారు. హెచ్వోడీ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్షాప్కు విద్యార్థులతోపాటు ఆచార్య సుధీర్కుమార్, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.