Kotha Prabhakar Reddy | సౌమ్యుడు.. మృదు స్వభావి.. చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తారు. తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేసే పనిమంతుడు. పురిటిగడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కేపీఆర్ ట్రస్టును నెలకొల్పారు. ఎంతో మంది నిరుపేదలకు సాయం చేశారు. దుబ్బాక ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సీఎంకు నమ్మిన బంటు.. కేసీఆర్ పోటీచేసి విజయం సాధించిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ పొందారు. రెండు సార్లు గెలిచి, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. మంత్రి హరీశ్రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ దుబ్బాక అభివృద్ధిలో ‘కొత్త’ కదలిక తీసుకువస్తున్నారు ప్రభాకర్రెడ్డి.
కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక మండలం పోతారం గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పోతారం, చీకోడు, లచ్చపేటలో చేశారు. సిద్దిపేటలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేశారు. వ్యవసాయం చేస్తూనే ట్రాన్స్పోర్టు రంగంపై దృష్టి సారించారు. అనతికాలంలోనే ఈ రంగంలో రాణిస్తున్నారు. వ్యాపార రంగంలో స్థిరపడిన తర్వాత పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో కేపీఆర్ ట్రస్టును నెలకొల్పారు. కరువు కాటకాలకు నిలయంగా మారిన దుబ్బాకలో నిరుపేదలను చూసి చలించారు. వర్షాల కోసం రైతులు అల్లాడుతుంటే.. వరుణయాగం చేశారు. కష్టం ఉన్న ప్రతిచోటా ఆపద్బాంధవుడిగా వచ్చి ఆదుకున్నారు. పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. లచ్చపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మహిళలు కూడా పాల్గొనేలా చేశారు. కూడవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భక్తులందరికీ అన్నదానం చేశారు. అనేక దేవాలయాలకు నిధులు సమకూర్చారు. దైవ కార్యక్రమాల్లో తన దాన శీలతను చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూనే తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై 2009 ఎన్నికలకు ముందే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనాయకునిగా ఉన్నారు. మాటలు తకువ పనిఎకువ చేస్తారని పార్లమెంట్లో ఆయనకు పేరున్నది. జాతీయ రహదారులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సలహా సంఘం కమిటీ, ఎరువులు, రసాయనాల, శక్తి వనరులపై వేసిన స్టాండింగ్ కమిటీల్లో సభ్యునిగా సేవలందించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మల్లన్నసాగర్ నుంచి జలాలు అందించి కూడవెల్లికి జీవం పోశారు. 100 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చారు. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు పంచారు. అత్యాధునిక వసతులతో నూతన బస్టాండ్ను నిర్మించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను తీసుకవచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.