హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హుమాయూన్నగర్లోని నైటింగేల్ నర్సింగ్సూల్లో 2022-23కు మూడేండ్ల జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సుల ప్రవేశాలకు అనుమతించాలని వైద్యవిద్యాశాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రవేశాల నోటిఫికేషన్లో తమ కాలేజీ పేరు లేకపోవడాన్ని సవాల్ చేస్తూ.. కాలేజీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. కాలేజీ అనుమతులను ఉపసంహరించకుండా ప్రవేశాల నిలుపుదల చెల్లదని స్పష్టంచేశారు. ప్రవేశాల నిరాకరణ సబబు కాదని పేర్కొంటూ సదరు విద్యా సంస్థ అడ్మిషన్ల నోటిఫికేషన్ గడువును పెంచారు. రెండు వారాల్లో అడ్మిష న్లు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.