హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): నిర్మాణంలో ఉన్న ఐదు సోలార్ ప్లాంట్లను ఈ ఏడాది జూన్ నాటికి ట్రాన్స్కోతో అనుసంధానం చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టి మే నాటికి పూర్తిచేయాలని చెప్పారు. గడువుకు ముందే ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణ, జీఎం (కోఆర్డినేషన్) ఎం సురేశ్, జీఎం (పర్చేజ్) మల్లెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.