వినాయక నగర్, మార్చి 27: సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ బుధవారం నిజామాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అసత్యాలు మాట్లాడినట్టు తెలిపారు. మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్రెడ్డి డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారని, అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపించారని ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు.