CM KCR | ‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. మళ్లీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డ మీదనే’
‘హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా, నాలుగేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీరుతా.తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు పారిస్తా’
‘ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎన్నోసార్లు వాదించాను. గోదావరి నీళ్లు ఊరికనే పోతున్నయి. మాకు ఇస్తే ఏం పాయె అని. వాళ్లు ఇయ్యలే. మేం ఇయ్యాల తెచ్చి చూపించినం’
‘మనిషి ఎప్పుడూ పుట్టిన తర్వాతనే నేర్చుకుంటడు తప్ప, పుట్టకముందే అన్నీ నేర్చుకొని మనం ఎవ్వరం భూమ్మీదకు రాం. టైం మనకోసం ఆగదు. ఆ ఉండిన టైమ్ను ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నాం.. దాన్ని ఎంత బాగా ఆస్వాదించినం.. మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నయా.. ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా.. ఇవన్నీ ఆలోచించుకోవాలి. సమస్య నుంచి పారిపోవద్దు. వి షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం’
… ఇవన్నీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన చెప్పే మాటలు.. చేసే పనులు ఏవైనా ఆ స్థాయిలోనే ఉంటయి. ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రమే కాదు.. ఇవ్వని హామీలనూ ఆచరణలోకి తీసుకొస్తారు కేసీఆర్.
రాహుల్గాంధీ: కేసీఆర్ది కుటుంబ పాలన. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నాడు. (మోతీలాల్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్, ప్రియాంక.. వీళ్లంతా ఎవరు? ఇంక ఈయనే చెప్పాలి.. కుటుంబపాలన గురించి. అయినా 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమో రాహుల్కే తెలియాలి. లెక్కల్లో మరీ ఇంత పూర్ అనుకోలేదు!)
రేవంత్రెడ్డి: సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కు తినేటోళ్లు! (భారీ ముడుపులు ఇచ్చి కొనుకున్న ఆ పీసీసీ అధ్యక్ష పదవే లేకపోతే ఈయన పరిస్థితి కచ్చితంగా అదే అయ్యుండేది!)
కిషన్రెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. (కేసీఆర్ హామీల జాబితా, గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాల లిస్టు ముందేసుకొని, ‘కుర్కురే’ తింటూ ఒక్క లుక్కేయండి. ప్రధాని మోదీ హామీల లిస్టుపై కూడా ఓ లుక్కేయండి. మోసం ఎవరిదో మీకే తెలుస్తుంది.)
ఈటెల రాజేందర్: బీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటేనే పథకాలు ఇస్తారా. పథకాలను ఆపేందుకు మీరెవర్రా? (మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటి మీ భాష చూడండి. అదే మీ స్థాయి.)
ఇవన్నీ ‘తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే‘ అని గాల్లో మేడలు కడుతున్న సోకాల్డ్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు. వారి మాటలకు, కేసీఆర్ చేతలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి-సంక్షేమం కేసీఆర్ మాటల్లో ప్రస్ఫుటిస్తాయి. మాటల్లో చెప్పింది కేసీఆర్ చేసి చూపిస్తారు. మరోవైపు ప్రతిపక్ష నేతల ప్రసంగాల్లో ఎంతసేపూ ‘కేసీఆర్ను దించుతాం.. కేసీఆర్ది అవినీతి పాలన.. కుటుంబ పాలన‘ వంటి రొటీన్ డైలాగులే ఉంటాయి తప్ప.. ‘తెలంగాణను కేసీఆర్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతాం.. ఇదిగో ఇది చేస్తాం’ అని వారు చెప్పలేకపోతున్నారు. అంత అవగాహన వారికి లేదు. ‘కేసీఆర్ను దించి ఆ పీఠం ఎక్కాలి’ అన్న అధికార లాలస తప్ప మరొకటి వారికి తెలీదు.
మరి మీ ఓటెవరికి? అధికార లాలసకా… అభివృద్ధి-సంక్షేమ పిపాసికా?
… మనోహర్ చిమ్మని