హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. అదేరోజు సికింద్రాబాద్- తిరుపతికి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లపై దృష్టిసారించినట్టు పేర్కొన్నారు.