బేగంపేట్, అక్టోబర్ 14: కిమ్స్ హాస్పిటల్స్, యూపీఐఏల సంయుక్త సహకారంతో సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ప్రాంగణంలో యూరో గైనకాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్స పద్ధతులపై మూడు రోజుల సదస్సు శనివారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వివిధ దేశాల యూరో గైనకాలజీ నిపుణులు.. ఈ రంగంలో వస్తున్న మార్పులు, కొత్త టెక్నాలజీ చికిత్సా పద్ధతులను పరిచయం చేశారు. కిమ్స్ అందిస్తున్న వైద్య సేవలను గవర్నర్ ప్రసంశించారు. కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఈ సమస్యల పట్ల మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమంలో వైద్యులు అనూరాధ పాండా, త్రిపుర సుందరి అనూరాధ నీనా దేశాయ్ పాల్గొన్నారు.