హైదరాబాద్: కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ, డెయిరీ రంగాలను
ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్ల ఆస్తి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా సంవత్సరానికి ప్రతీ యూనిట్కు రూ.100 నామమాత్రపు పన్నును గ్రామపంచాయతీలు వసూలు చేస్తాయి.