Command Control Centre | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంత మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారో అన్నది తేల్చాల్సింది వైద్యారోగ్యశాఖ. ఆ పిల్లలకు పోషకాహారం అందించేది పాఠశాల విద్యాశాఖ. పాఠశాల విద్యాశాఖ వద్ద తగిన సమాచారం లేకపోవడంతో రక్తహీనత నుంచి చిన్నారులను బయటపడేసే మెనూను మధ్యాహ్న భోజనంలో చేర్చలేకపోయారు. ఈ రెండుశాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణం. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్, వైద్యారోగ్య శాఖల్లో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు.
విద్యాశాఖ పనితీరును పర్యవేక్షించే మూడో నేత్రం లాంటి ఈ సెంటర్ను సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం రెండో అంతస్థులో ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న దాదాపు 42 వేలకుపైగా పాఠశాలలు, 62 లక్షల మంది విద్యార్థులపై ఈ సెంటర్ పర్యవేక్షణ జరుపుతుంది. ఇందులో 50 మంది వరకు సిబ్బంది, కాల్సెంటర్ ఉంటుంది. దీన్ని నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ (ఎన్బీఈఏఆర్) ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించారు. ఇది రియల్ టైమ్ సర్వైలెన్స్ సిస్టం. ఉపాధ్యాయుల పనితీరును, విద్యాప్రమాణాలను మెరుగుపరిచే అధునాతన వ్యవస్థ. రాష్ట్రంలోని టీచర్లకు ఈ నెల 20న ట్యాబ్లు ఇవ్వనున్నారు. వారి హాజరును పర్యవేక్షించేందుకు జీపీఎస్ ఆధారిత అటెండెన్స్ను అమలు చేయనున్నారు.
పనితీరు ఇలా..