హైదరాబాద్ : త్వరలో ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు, బదిలీలను చేపడుతాం. ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణను గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, కోశాధికారి లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.