Green India Challenge | బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ది కపిల్ శర్మ షోలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడుతూ.. ఆ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వామ్యం అవుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి ఫిల్మ్ సిటీలో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటిన విషయాన్ని కపిల్ శర్మ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రశంసించే ఊరుకుంటే సరిపోదు.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రేరణ కలిగించాలని కపిల్ శర్మ సూచించారు. విరివిగా మొక్కలు నాటడంతో.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వాళ్లం అవుతామని తెలిపారు. అది మన బాధ్యత కూడా అని పేర్కొన్నారు. సంతోష్ కుమార్ కోట్ల సంఖ్యలో మొక్కలు నాటించారు. తాను కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు.
Thank you so much @KapilSharmaK9 ji for planting Neem sapling as part of #GreenIndiaChallenge initiative. A person of your stature and with such a huge fan following says some kind words about #GIC and appealing your huge fan base to participate in plantation programmes, is very… https://t.co/aGLRQNdLwn pic.twitter.com/IHZ3eQ9x9V
— Santosh Kumar J (@SantoshKumarBRS) May 13, 2023