యాదగిరిగుట్ట : అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వుప్పల వినయ్ భాను రెడ్డి (Lieutenant Colonel VVB Reddy) అంత్యక్రియలు శనివారం అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. కల్నల్ స్వగ్రామమైన యాదగిరి గుట్ట(Yadagirigutta District) జిల్లా బొమ్మలరామారానికి చేరుకున్న వీవీబీ రెడ్డి భౌతికకాయం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి( Minister Jagadish Reddy), సైనిక అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.
వీరితో పాటు స్థానిక శాసన సభ్యురాలు గొంగొడి సునీతామహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, రాచకొండ కమిషనర్ చౌహాన్, తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కల్నల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
సైనిక వాహనంపై భౌతికకాయం ఉంచి అంతిమయాత్రను నిర్వహించారు. ఈ ర్యాలీలో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు.మూడు కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం కల్నల్ వినయ్ రెడ్డి అమర్ హై అంటూ నినాదాలు చేశారు.