చైనా బార్డర్ దగ్గర ఉన్న గాల్వన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో మన దేశ సైనికులు 20 మందితో పాటు.. కల్నల్ సంతోష్ బాబు కూడా వీరమరణం పొందారు. కల్నల్ సంతోష్ బాబు.. తెలంగాణ వ్యక్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలిచింది. సంతోష్ బాబుతో పాటు.. ఆరోజు ప్రాణాలు కోల్పోయిన మిగితా సైనికుల కుటుంబాలకు కూడా సాయం చేసి.. వారి కుటుంబాలను సన్మానిస్తామని సీఎం కేసీఆర్ అంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా.. గాల్వన్ వ్యాలీలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. దీనిపై కల్నల్ సంతోష్ బాబు భార్య, డిప్యూటీ కలెక్టర్ సంతోషి స్పందించారు. సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఈసందర్భంగా మాట్లాడిన సంతోషి.. గాల్వన్ ఘటన యావత్ దేశం మరిచిపోలేని ఘటన. అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోర్డర్లో దేశం కోసం తమ ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించే విషయం ఇది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్కు.. జవాన్ల కుటుంబాల తరుపున సంతోషి కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం గాల్వన్ వ్యాలీలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఝార్ఖండ్ సీఎం శ్రీ @HemantSorenJMM తో కలిసి ఆర్థిక సాయం అందజేసిన సీఎం శ్రీ కేసీఆర్. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి, మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు చెరో రూ.10 లక్షల చెక్ లను అందించారు. pic.twitter.com/HPSJhImyug
— Telangana CMO (@TelanganaCMO) March 4, 2022