నాంపల్లి కోర్టులు, జూలై 5 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఓ కళాశాల డైరెక్టర్ రోకండ్ల వేంకటేశ్వర్రావు, మరో కాలేజీ ప్రొఫెసర్ విశ్వ ప్రకాశ్బాబు అలియాస్ విశ్వంను సిట్ అరెస్టు చేసింది. వీరిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఎదుట మంగళవారం రాత్రి సిట్ అధికారులు హాజరుపరిచారు. వారికి జడ్జి ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఈ నిందితులిద్దరూ రూ.4.85 లక్షలకు పూల రమేశ్ (ఏఈ)తో ప్రశ్నపత్రాల అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకొని, గ్రూప్-1, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలను నిరుద్యోగులకు అందించారని, మాల్ప్రాక్టీస్కు కూడా దోహదపడ్డారని సిట్ అధికారులు రిమాండ్ డైరీలో తెలిపారు. ఈ కేసులో వీరితోపాటు ఇతరుల పాత్ర కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. సోదరులు పూల రమేశ్ (ఏఈ), పూల రవికిశోర్ ద్వారా పరిచయమైన ఇతర నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నదని తెలిపారు. కాగా, ఇదే కేసులో మహ్మద్ ఖాలిద్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సిట్ విచారణకు సోమ, శుక్రవారాల్లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.