మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కే శశాంక సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులు సహకరించాలన్నారు. పంటలను సాధ్యమైనంతవరకు కల్లాలు లేదా ఇంటివద్ద నైనా ఆరబెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.