ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని అటవీ గ్రామాలైన సుంగాపూర్, చోర్గావ్లో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం పర్యటించారు. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు.
గిరిజనులతో కలిసి రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి సుంగాపూర్లోని తాగు నీటి బావిని పరిశీలించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
– నార్నూర్