జగిత్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రానున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం జగిత్యాల కలెక్టర్ రవి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించేలా, రూట్మ్యాప్, పలు స్థలాల ఎంపికకై పరిశీలన జరిపారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
సీఎం పర్యటన సందర్భంగా గుడి సమీపంలో పార్కింగ్ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలంతో పాటు ఆలయానికి వెళ్లే దారినిని సైతం పరిశీలించారు. కలెక్టర్ వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మాధురి , ఎండోమెంట్, ఆర్అండ్బీ అధికారులతో పలు శాఖల అధికారులు, జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, మల్యాల తహసీల్దార్ సుజాత, సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు.