ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆరాతీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రాతో కలిసి గ్రామానికి వెళ్లారు. రెండు కిలోమీటర్లు నడిచి, కునికసా సమీపంలోని వాగు దాటి గ్రామానికి చేరుకొన్నారు. వైద్యసిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 25 వేల చెక్కు అందజేశారు. రోడ్డు, వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -నార్నూర్