మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 20: జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బు వసూలు చేస్తు న్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లాఖాన్ పూర్కు చెందిన జాలం రాఘవేందర్ కృష్ణ.. ఆర్టీవో అధికారుల వద్ద డ్రైవరు అసిస్టెంట్గా పనిచేసి మూ డేండ్ల కిందట మానేశాడు. డబ్బులు సులువుగా సంపాదించాలని రవాణా అధికారి అవతారం ఎత్తాడు.
తోడుగా వనపర్తి జిల్లా మదనాపురం మండలానికి చెందిన గారాడి శివకుమార్తో కలిసి ఎన్హెచ్ -44పై లారీలను ఆపి, డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద హైవే పెట్రోలింగ్ పోలీసులు వారి వివరాలు సేకరిస్తుండగా, భయంతో పారిపోతుండగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.