ప్రమాదంలో ఆర్ఐ ఈశ్వర్రావు మృతి
ఆదుకొన్న 2009 బ్యాచ్ ఆర్ఎస్సైలు
హైదరాబాద్, మార్చి 12 : ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు ఒకరు. విజయనగరం జిల్లాలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్ర మాదంలో మృతిచెందారు. దీంతో పేదరికంలో ఉన్న ఈశ్వర్రావు కుటుంబానికి అండగా నిలవాలని ఆయన బ్యాచ్మేట్స్ నిర్ణయించారు. తెలంగాణ, ఏపీలోని తమ సహచరులందరి నుంచి డబ్బులు సేకరించారు. ఇలా సేకరించిన రూ.11 లక్షలను శనివారం రాజమండ్రిలోని ఈశ్వర్రావు తల్లిదండ్రులకు అందజేశారు. వారికి తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీకి చెందిన రిజర్వ్ ఇన్స్పెక్టర్లతోపాటు తెలంగాణకు చెందిన ఆర్ఐలు పీ రవికుమార్, ఎం కుమారస్వామి పాల్గొన్నారు.