సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చలి క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 30.4, కనిష్ఠం 18.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలిలో తేమ 45 శాతంగా ఉందని చెప్పారు. ఎలాంటి వర్ష సూచనలు లేవని వెల్లడించారు.