హైదరాబాద్: రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా ఉండి చలి తీవ్రత పెరిగిపోతున్నది. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.5 డిగ్రీలు నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్లో 9.7, నిర్మల్లో 10.3 డిగ్రీలు, మంచిర్యాలలో 10.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్లో 10 డిగ్రీలు, మెదక్ జిల్లా టెక్మాల్లో 10.4 డిగ్రీల చొప్పున నమోదయింది.
జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటున్నది. ఉదయం వేళల్లో పలు ప్రాంతాలను పొగమంచు కప్పేస్తున్నది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.