హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ విభాగానికి పూర్వ విద్యార్థుల చొరవతో కోల్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. మై నింగ్ కోర్సు బోధకుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపునకు చైర్ ఏ ప్రొఫెసర్ కార్యక్రమంలో రూ.3 కోట్లు డిపాజిట్ చేసిం ది. సోమవారం వర్సిటీలో ఒప్పంద పత్రాలపై కోల్ ఇండియా చైర్మన్ ఎండీ ప్రమోద్ మహాజన్, ఓయూ వీసీ డీ రవీందర్ సంతకాలు చేశారు.
కార్యక్రమంలో ఓయూ పూర్వ విద్యార్థి, కోల్ ఇండియా డైరెక్టర్ (టెక్నికల్) బీ వీరారెడ్డి, మైనింగ్ విభాగం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, సింగరేణి మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్, మాజీ జనరల్ సెక్రటరీ, సింగరేణి మాజీ జీఎం ఎంఎస్ వెంకటరామయ్య, గోపాల్రావు, కేంద్ర బొగ్గు మం త్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ డీఎన్ ప్రసాద్, పూ ర్వ విద్యార్థి సంఘ నాయకులు అమర్నాథ్, డీఆర్వీ సుశీల్కుమార్, మహేశ్ పాల్గొన్నారు.