సిరిసిల్ల రూరల్, జూన్ 25: సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని పెద్దూరుకు చెందిన బీజేవైఎం మండల నాయ కుడు మోడుదుల మహేందర్ సతీమణి భాగ్యలక్ష్మికి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును ఆదివారం పెద్దూరు సింగిల్విండో చైర్మన్ జీల కిషన్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ .. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ అమలవుతున్నదని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.