హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): 2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు నిర్ణీత గడువులోగా బియ్యం ఇవ్వలేదు.
దీంతో ఆ మిల్లులకు జరిమానా విధించిన పౌరసరఫరాల శాఖ, ఇవ్వాల్సిన బియ్యానికి తోడుగా అదనంగా మరికొంత బియ్యం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు నిరుడు డిసెంబర్తో ముగిసింది. అయినా మిల్లులు పూర్తిస్థాయిలో బియ్యం అందించలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలనే మిల్లర్ల విజ్ఞప్తి మేరకు సీఎంఆర్ సేకరణ గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.