హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ‘చేజింగ్ సెల్’ నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు.
హైదరాబాద్లోని బెల్లా విస్టా క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) 66వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తున్నదని, అందుకే తెలంగాణలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అస్కీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.