హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఉద్యోగుల నిమిత్తం మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోసగాళ్లు డబ్బు తీసుకొని అన్ఫిట్ చేయిస్తామని ప్రలోభపెడితే వారిని నమ్మొద్దని చెప్పారు. అన్ఫిట్ అయిన వారి స్థానంలో ఇప్పటికే సుమారు 16,000 మంది వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. మోసగాళ్ల సమాచారాన్ని విజిలెన్స్ దృష్టికి తీసుకొస్తే.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.