హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
ఈ మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు గిరిరాజన్ ద్వారా శుక్రవారం ప్రగతిభవన్కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28 నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని తమిళనాడు సీఎం కోరారు. సీఎం కేసీఆర్కు ఎంపీ గిరిరాజన్ శాలువా కప్పి, జ్ఞాపిక, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ పోటీల్లో 188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారని, దేశంలో తొలిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న పోటీలని ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖలో స్టాలిన్ పేరొన్నారు.