CM CKR | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది. డబ్బాల్లో రాళ్లేసి లోడలోడ ఊపినట్టు వొర్రుడు తప్పా.. ఏం మంచి పని చేసింది. మంచి పనైతే మనకు తెల్వదా. మనం ప్రజలం కాదా. ఒక వేళ మంచిపని చేస్తే మనదాకా రాదా. ఏ రంగానికి చేశారు.. వ్యవసాయ రంగానికా? దళితవర్గానికా? గిరిజన వర్గానికా? బీసీ ప్రజలకా? చేనేత కార్మికులా? గీత కార్మికులా? ఎవరికి లాభం జరిగింది దేశంలో.. ఎవరు బాగుపడ్డరు. గ్రామీణ, సామాన్య, పేద ప్రజలు ఎవరికీ ఏకాన పని జరుగలే.. ఇది వాస్తవం’ అన్నారు.
వాస్తవాలు మాట్లాడితే.. ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తం అంటున్నరు.. చూసేదేంది సంగతి తోకమట్టనా.. చూసేది కేసీఆర్ సంగతేనా.. కేసీఆర్ భయపడుతడా.. భయపడితే తెలంగాణ వచ్చునా. ఎనిమిదేళ్లు మా బతుకు మేమే బ్రతికినం కదా.. ఇవాళ లేని డబ్బా ప్రచారాలు, సోషల్ మీడియాలో చెప్పేవన్ని పచ్చి అబద్దాలు. నేను చెప్పే మాటను గ్రామాల్లో, కుటుంబాల్లో పది మంచి చర్చ పెట్టాలని.. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో చర్చ పెడుతడా? ఎవరైనా పెట్టరు.. ఎదురుగా పైసలు ఇచ్చినా పెట్టరు. తెలంగాణకు ఇవాళ పెట్టుబడులు ఎలా వస్తున్నయ్.. ఎందుకు వస్తున్నయ్.. ఏ కారణం చేత వస్తున్నయ్.. ఈ బీజేపీ ఉంటే.. మత కల్లోలం రేగితే.. మత పిచ్చి లేస్తే.. పొద్దున లేస్తే లాఠీచార్జీలు.. లూఠీలు.. కర్ఫ్యూలు, ఫైరింగ్లుంటే ఎవరైనా వస్తరా? శాంతి, సౌఖ్యం ఉంటే.. లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు వస్తయ్.. ఫ్యాక్టరీలు వస్తయ్. మోదీ సిగ్గుపడాలి నరేంద్ర మోదీ. ఏ దేశం ఎవని అయ్య సొత్తు కాదు. నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోరు.
‘ఇవాళ ఐటీ రంగంలో భారతదేశానికి సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ కర్నాటక రాష్ట్రం. దాని తర్వాత స్థానంలో ఉన్నది హైదరాబాద్ సిటీ. కర్నాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నారు.. ఆడ పిల్లలు, మన బిడ్డల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి నేడు కశ్మీర్లో తయారు చేస్తున్నరు. ఇది అవసరమా ఈ దేశానికి. దేశంలో ఉండే సహృద్భావ వాతావరణం నాశనమైతే ఎవరు పెట్టుబడులు పెడుతరు? ఎవరికి ఉద్యోగాలు వస్తయ్?.. ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో ఇప్పటికే నష్టపోయినం. ఇది నాలెక్క కాలేదు. కుక్కళ్లా మొరగడం కాదు.. బీజేపీలో ఒక్క మొగోడైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా?.. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఎలా పడిపోతున్నయ్?.. సెప్టెంబర్లో 4.4శాతం, అక్టోబర్లో 4శాతం, నవంబర్లో 1.4శాతం, డిసెంబర్లో 0.4శాతం.. దీన్ని ఏమంటారు మోదీ గారు’.. మీ ఉజ్వలమైన మీ గొప్ప పరిపాలనకు ఇది తార్కాణమా? అంటూ ప్రశ్నించారు.
దేశంలో 15, 16లక్షల పారిశ్రామిక లక్షల పరిశ్రమలు మూతపడ్డయ్ నిజం కాదా? అబద్దమా?.. ఈ పరిపాలన కొనసాగి.. మతపిచ్చి లేచి.. పొద్దున లేస్తే కర్ఫ్యూ, పోలీస్ లాఠీచార్జీలు ఇవేనా కావాల్సింది దేశానికి. 140 కోట్ల మంది ఉండే దేశంలో ఈ దిక్కుమాలిన పద్ధతా? మత విద్వేమా? ఎవరి కడుపుతుండతది?.. దేనికి పనికొస్తతా.. పిల్లలకు భవిష్యత్ ఉండాలన్నా.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. ఈ దేశం ముందుకు వెళ్లాలన్నా కులం, జాతి బేధం లేకుండా అందరు ముందుకుపోయే దేశాలు లేవా?.. అమెరికాలో 95శాతం క్రైస్తవులు ఉంటరు.. వాళ్లు ఉన్నడూ మతపిచ్చి లేపరు.. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నరు. రాజకీయంగా అర్థం చేసుకొని, స్పందించకపోతే, అవసరమైన తీర్పు ప్రజలు చెప్పకపోతే.. దేశం నాశనమైపోతది’ అన్నారు.
తాను కోరుకున్న తెలంగాణ వచ్చిందని.. ఆ నాటి పోరాటంలో అందరం కలిసి కొట్టాడామని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చిన తెలంగాణను కడుపుకట్టుకొని, నోరుకట్టుకొని.. ఇన్ని మంచినీళ్లో, సాగునీళ్లో.. ఇంత కరెంటో.. ఇంత బియ్యం.. సంక్షేమమో చేసుకుంటున్నం.. ఇప్పుడిప్పుడే రేవున పడుతున్నం. జరజర ఊళ్లు దమ్ముతీసుకుంటే కండ్లు మండుతున్నయా?.. ఈ దేశంలో ఏ బీజేపీ మోగోడు సమాధానం చెబుతడో నాకు చెప్పాలి.. ఈ దేశంలో 4లక్షల మెగావాట్ల కరెంటు ఉన్నది. దేశంలో వాడేది 2లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ దాటది. ఇది ఎవరి తెలివితక్కువ తనం. దేశాన్ని పాలించే నరేంద్ర మోదీ తెలివితక్కువ తనం కాదా?. కేంద్రం ప్రభుత్వం బ్యాడ్ పవర్ పాలసీకాదా? ఎవరు బాధ్యులు దీనికి. దేశంలో 65వేల టీఎంసీలు నీళ్లు ఉన్నయ్.. ఇది నా లెక్క కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు లెక్క.. ఇవాళ్టి వరకు 35వేల టీఎంసీలకు మించి వాడలే. కానీ దేశంలో తాకులాటలు.. పీకులాటలు.. కావేరి, గోదావరి మీద కొట్లాట.. గొంగడి మీద, గోసి మీద కొట్లాట. ఇది సెంట్రల్ గర్నమెంట్ తెలివితక్కువ తనం కాదా? కంట్రి బ్యాడ్ వాటర్ పాలసీకాదా? దీనికి ఎవరు బాధ్యులు. 4లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి ఉండే దేశంలో 24 గంటల కరెంటు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో ఇయ్యరు.. ఇదేం ప్రజల ఖర్మమా?.. ఇవేనా మీ తెలివితేటలు.. గొప్పదనం అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.