హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.