CM Revant Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు.