హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్రెడ్డి లండన్లోని నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. యూకే పర్యటనలో భాగంగా ఆదివారం లండన్లో నిర్వహించిన ప్రవాస తెలుగు ప్రతినిధుల సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ రైజింగ్ సన్నాహాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడంలో చొరవ చూపాలని కోరారు.