హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ఒకవైపు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలిసింది.
మంగళవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బుధవారం ఉదయం హైదరాబాద్కు చేరుకోనుండగా, అసెంబ్లీ సమావేశానికి ఆయన అలా వచ్చి.. మళ్లీ వెంటనే గుంటూరు వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం ఢిల్లీ టూ ఏపీకి చక్కర్లు కొడుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.