హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది. ఇప్పటికే రెండు పర్యాయాలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్, ఇంకా ఎనిమిదిమంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నది. ఈ సీట్లకు గట్టిపోటీ ఉండటంతో అభ్యర్థుల ఎంపి క అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తమ కుటుంబసభ్యులకు టికెట్లు దక్కించుకునేందుకు పోటీపడుతున్నా రు. భువనగిరి టికెట్ కోసం సీఎం రేవంత్రెడ్డి తన అనుచరుడు చామల కిరణ్కుమార్రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన భార్య లక్ష్మి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు భువనగిరి నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పైళ్ల శేఖర్రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారు దాదాపు ఖరారు అయినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.