హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో టీఎస్పీఎస్సీలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సహకారం అందించాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్సోని, కార్యదర్శి శశిరంజన్కుమార్తో భేటీ అయ్యారు. యూపీఎస్సీ పనితీరు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దాదాపు గంటన్నరపాటు చర్చించారు. యూపీఎస్సీ దాదాపు వందేండ్లుగా నిర్ధిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నదని రేవంత్ అభినందించారు. టీఎస్పీఎస్సీలో అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్తోపాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని రేవంత్రెడ్డికి మనోజ్సోని తెలిపారు.
హైదరాబాద్లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతు బజార్ వద్ద సైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అకడ ఉన్న రక్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని కోరగా, మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.
తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-24 మధ్య ఏటా 450 కోట్ల చొప్పున 1800 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నదని, వీటిని అందజేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 2,233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని విన్నవించారు. సమావేశాల్లో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం ఓఎస్డీ అజిత్రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ పాల్గొన్నారు.