ములుగు : బిల్ట్ ఫ్యాక్టరీ (Built factory)పారిశ్రామిక యూనిట్ల పునరుద్ధరణకు(Restoration) అన్ని విధాల సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ములుగు(Mulugu) జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ(Paper factory) 2014లో కొన్ని కారణాలవల్ల మూతపడింది. దానిని పునరుద్ధరించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి, ఉపాధిని కల్పించడానికి ములుగు జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటీసీ కంపెనీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.