హైదరాబాద్: మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల దానిని పంచాయతీలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.