హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉండాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఫోన్ చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్రెడ్డిని సీఎం కోరారు.