Jana Reddy | హైదరాబాద్ : తనకు ఇప్పుడు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. జానారెడ్డిని సీఎం రేవంత్ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన రేవంత్కు జానారెడ్డి దంపతులు శాలువా కప్పి ఆహ్వానించారు. జానారెడ్డి, రేవంత్ మధ్య దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి.
భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలోచిస్తాను. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రికి సూచించాను. సీఎం, మంత్రులు ఐక్యంగా పని చేయాలి. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కాను.. అవసరం లేదన్నారు. 15 ఏండ్లుగా మంత్రిగా ఉన్నాను. ఇప్పుడు ఏ మంత్రి పదవి అవసరం లేదు. కేసీఆర్కు అలా జరగడం బాధాకరం.. ఆయనను కూడా పరామర్శించాను. త్వరగా కేసీఆర్ కోలుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సలహాలు, సూచనలు అవసరం అన్నారు. జయవీర్కు పదవి ఇవ్వాలని తాను అడగలేదు అని జానారెడ్డి స్పష్టం చేశారు.