హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక-సారలమ్మకు ఆన్లైన్లో నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆన్లైన్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మనమడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి సమర్పించారు. తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో మంత్రు లు కొండా సురేఖ, ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అధికారులు పాల్గొన్నారు.