మషీరాబాద్, ఏప్రిల్ 8: పార్లమెంటు సీట్ల కేటాయింపులో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను విస్మరిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ఈ నెల 15వ తేదీలోగా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకపోతే గాంధీభవన్తోపాటు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు.
విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
ఇప్పటికే ప్రకటించిన పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను 15వ తేదీలోగా మార్చి మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాలని, లేని పక్షంతో 16వ తేదీన గాంధీభవన్తోపాటు అన్ని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో కాం గ్రెస్ను చిత్తుగా ఓడిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, నందిగామ నర్సింహ్మ, రాజేశ్, శ్యాంరావు, వెంకట్, నాగరాజు, ప్ర వీణ్, రమేశ్, రఘు తదితరులు పాల్గొన్నారు.