హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాళ్లను సీఎం రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మారెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నైట్ బజార్లోని 119 స్టాళ్లను 2017 నుంచి నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. రైతు బజార్ తరహాలో స్వయం సహాయక మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను మారెటింగ్ చేసుకునేలా స్టాల్స్ను తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. వీటిని మహిళలకు మాత్రమే కేటాయించాలని ఆదేశించారు. ఇందుకు ఉత్తర్వులను సిద్ధం చేయాలని చెప్పారు.