హైదరాబాద్ : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) తల్లి అనసూయమ్మ(Anasuyamma) మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం (Condoles) వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మధుయాష్కీకి, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి మనో ధైర్యం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. కాగా, మధుయాష్కిని పలువురు పరామర్శించి ఓదార్చారు.