హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్(Rajeev Ratan) మృతిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సమర్ధవంతంగా పని చేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ (Vigilance DG Rajeev Ratan) గుండెపోటుతో (Heart attack) మంగళవారం కన్నుమూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు.
ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి(Died) చెందారు. రజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. అలాగే ఆప రేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వివిధ హోదాల్లో పని చేశారు.