Revanth Reddy | మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. 50వేల మెజారిటీతో వంశీచంద్ను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.