KGBV | పెంట్లవెల్లి, ఆగస్టు 5 : పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కేజీబీవీలో 30 మంది విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు.
విద్యార్థినులు పేరెంట్స్తో మాట్లాడుతూ ‘మాకు ఈ పాఠశాల వద్దు.. మీ వెంటే మేము వస్తాం..’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సీఎం అయ్యాక విద్యాశాఖకు మంత్రిని నియమించలేదని ధ్వజమెత్తారు. పురుగుల అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో వంటచేసి పెడుతున్నారని వాపోయారు. ఎస్వోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.